మనుషులు మారాలి ఎపిసోడ్ - 4 | Manushulu Marali Episode 4 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com
Description
'Manushulu' Marali Episode 4' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 13/11/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
మాధవి మరిది రమేశ్ చాలా తెలివైనవాడు, లౌక్యం బాగా తెలుసున్నవాడు. “అన్నయ్య ఇంట్లో ఎన్నాళ్లు చాకిరీ చేస్తూ కూర్చుంటావమ్మా, ప్రీతి కూడా మరీ మరీ చెప్పి పంపించింది, అత్తయ్యగారిని మామయ్యగారిని మన దగ్గర పెట్టుకుందాం, వాళ్లకు ఏ కష్టమూ రాకుండా చూసుకుందామని చెపితే వచ్చాను. మీ బట్టలూ అవీ సర్దుకోండి. అన్నయ్యకూ వదినకూ నేను నచ్చ చెపుతా”నని వాళ్లతో చెప్పి అన్నగారితో మాట్లాడదామని హాల్ లోకి వచ్చాడు. “ఏరా రమేశ్, ప్రీతి, బాబు ఎలా ఉన్నా”రంటూ శేఖర్ తమ్ముడిని ఆప్యాయంగా పలకరించాడు. “బాగానే ఉన్నారన్నయ్యా. అమ్మా నాన్నగారిని నా దగ్గరకు తీసుకువెడదామని వచ్చాను. వాళ్లకి ఎన్నాళ్లు నా దగ్గర ఉండాలనిపిస్తే అన్నాళ్లూ ఉంటారు. పాపం ఇంతకాలం నీవు వదినా వాళ్లను బాధ్యతగా చూస్తూ వచ్చారు. నాకు కూడా వాళ్లను దగ్గర పెట్టుకుని చూసుకోవాలనిపిస్తుంది కదా”. “అదేమిటి రమేశ్? ఎందుకనిపించదు? అసలు నీవు ప్రీతీ, బాబూ మనం అందరం ఒకే చోట కలసి ఉందామని నీతో ఎన్నో సార్లు చెప్పాను. ప్రీతి ఆఫీస్ కు ఇక్కడ నుండి వెళ్లడం కష్టం అవుతుందనేసరికి అదీ నిజమే అనుకున్నాను. అమ్మా నాన్నగారు ఎక్కడ ఉంటేనేమి? నీవు ప్రీతి బాబుతో కలసి ఎప్పుడు చూడాలని పించినా ఇక్కడకు రావచ్చు ఉండచ్చు”. ఈ లోగా ప్రసూనాంబ అక్కడకు వచ్చి శేఖర్ వైపు చూస్తూ “కొన్నాళ్లు వెళ్లి రమేశ్ దహ్గర ఉంటామురా. వాడూ పాపం మా కోసం అల్లాడిపోతున్నాడు. ప్రీతి కూడా పదే పదే చెప్పి పంపించిందిట. మేము కొన్నాళ్లు రమేష్ దగ్గర ఉంటే పాపం మాధవి కి కూడా రెస్ట్ గా ఉంటుంది కదా”.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link