DiscoverGita Acharan
Gita Acharan
Claim Ownership

Gita Acharan

Author: Siva Prasad

Subscribed: 3Played: 12
Share

Description

Bhagavad Gita is a conversation between Lord Krishna and Warrior Arjun.

The Gita is Lord's guidance to humanity to be joyful and attain moksha (salvation) which is the ultimate freedom from all the polarities of the physical world. He shows many paths which can be adopted based on one's nature and conditioning. This podcast is an attempt to interpret the Gita using the context of present times.

Siva Prasad is an Indian Administrative Service (IAS) officer. This podcast is the result of understanding the Gita by observing self and lives of people for more than 25 years, being in public life.
434 Episodes
Reverse
ਆਪਣੇ ਰੋਜ਼ਾਨਾ ਜੀਵਨ ਵਿੱਚ ਅਸੀਂ ਕੁੱਝ ਕਰਮਾਂ ਨਾਲ ਜੁੜ ਜਾਂਦੇ ਹਾਂ, ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਅਸੀਂ ਪਸੰਦ ਕਰਦੇ ਹਾਂ, ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਆਸਕਤੀ (ਦਿਲਚਸਪੀ ਜਾਂ ਲਗਾਵ) ਦੇ ਨਾਂ ਨਾਲ ਜਾਣਿਆ ਜਾਂਦਾ ਹੈ।  ਇਸ ਤੋਂ ਅਲਾਵਾ ਅਸੀਂ ਕੁੱਝ ਕਰਮਾਂ ਨਾਲੋਂ ਨਫ਼ਰਤ ਦੀ ਵਜ੍ਹਾ ਨਾਲ ਵੱਖ ਹੋ ਜਾਂਦੇ ਹਾਂ, ਜਿਸ ਨੂੰ ਵਿੱਰਾਕਤੀ (ਘ੍ਰਿਣਾ) ਕਿਹਾ ਜਾਂਦਾ ਹੈ ਪਰੰਤੂ ਸ੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਇੱਥੇ ਇਕ ਤੀਜੀ ਅਵਸਥਾ ਦਾ ਜ਼ਿਕਰ ਕਰਦੇ ਹਨ, ਜਿਸ ਨੂੰ ਅਨਾਸਕਤੀ ਕਹਿੰਦੇ ਹਨ, ਜੋ ਆਸਕਤੀ ਤੇ ਵਿੱਰਾਕਤੀ ਦੋਹਾਂ ਨੂੰ ਪਾਰ ਕਰਨਾ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਕਹਿਣਾ ਹੈ ਕਿ ਇਕ ਅਗਿਆਨੀ ਬੰਦਾ ਕਰਮ ਨਾਲ ਲਗਾਵ ਰੱਖਦਾ ਹੋਇਆ ਕਰਮ ਕਰਦਾ ਹੈ ਅਤੇ ਇਕ ਸਿਆਣਾ (ਵਿਦਵਾਨ) ਬੰਦਾ ਉਸ ਕਰਮ ਨਾਲ ਬਿਨਾਂ ਕਿਸੇ ਲਗਾਵ  ਤੋਂ, ਸੰਸਾਰੀ ਜੀਵਾਂ ਦੇ ਭਲੇ ਲਈ ਕੰਮ ਕਰਦਾ ਹੈ (3.25)। ਆਸਕਿਤ ਅਤੇ ਵਿਰੱਕਤ ਉੱਤੇ ਅਧਾਰਤ ਕਰਮ ਸਾਨੂੰ ਦੁੱਖੀ ਕਰ ਸਕਦੇ ਹਨ। ਕਿਸੇ ਸਾਡੇ ਪਿਆਰੇ (ਆਸਕਿਤ) ਦੀ ਹਾਜ਼ਰੀ ਸਾਨੂੰ ਖੁਸ਼ੀ ਦਿੰਦੀ ਹੈ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਦੀ ਗੈਰ ਹਾਜ਼ਰੀ ਸਾਨੂੰ ਦੁਖੀ ਕਰਦੀ ਹੈ। ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਘਿ੍ਰਣਾ ਕਰਨ ਵਾਲੇ (ਵਿਰੱਕਤ) ਦੀ ਹਾਜ਼ਰੀ ਸਾਨੂੰ ਦੁਖੀ ਕਰਦੀ ਹੈ ਅਤੇ ਉਸ ਦੀ ਗੈਰ ਹਾਜ਼ਰੀ ਸਾਨੂੰ ਸਕੂਨ ਦਿੰਦੀ ਹੈ। ਇਸ ਲਈ ਆਸਕਿਤ ਜਾਂ ਵਿਰੱਕਤ ਦੋਵੇਂ ਹੀ ਸਾਨੂੰ ਸੁੱਖ ਅਤੇ ਦੁੱਖ ਦੇ ਧਰੁੱਵਾਂ ਦੇ ਵਿਚਕਾਰ ਝੁਲਾਉਣ ਲਈ ਸਮਰੱਥ ਹਨ। ਇਸ ਲਈ ਸ੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ ਸਾਨੂੰ ਸਲਾਹ ਦਿੰਦੇ ਹਨ ਕਿ ਕਿਸੇ ਵੀ ਕਰਮ ਨੂੰ ਕਰਦੇ ਸਮੇਂ ਦੋਵਾਂ ਤੋਂ ਪਾਰ ਹੋ ਕੇ ਅਨਾਸਕਤੀ ਦਾ ਰੂਪ ਧਾਰਨ ਕਰੀਏ। ਸੰਸਾਰ ਦੇ ਕਲਿਆਣ ਨੂੰ ਹਮਦਰਦੀ (ਦਇਆ) ਭਾਵਨਾ ਦੇ ਸਮਾਨ ਸਮਝਿਆ ਜਾ ਸਕਦਾ ਹੈ, ਜਿਹੜੀ ਅਨਾਸਕਤੀ ਨਾਲ ਕਰਮ ਕਰਨ ਉੱਤੇ ਉਭਰ ਕੇ ਅੱਗੇ ਆਉਂਦੀ ਹੈ। ਜਦੋਂ ਆਸਕਿਤ ਜਾਂ ਵਿਰੱਕਤ ਦੇ ਨਾਲ ਕੋਈ ਕਰਮ ਕੀਤਾ ਜਾਂਦਾ ਹੈ ਤਾਂ ਇਹ ਕਚਰੇ ਦੇ ਇਕ ਟਰੱਕ ਦੇ ਸਮਾਨ ਹੈ ਜੋ ਹਰ ਥਾਂ ਤੇ ਗੰਦ ਫੈਲਾਉਂਦਾ ਹੈ, ਜਿਸ ਦਾ ਅਰਥ ਸਮਾਜ ਨੂੰ ਹਾਨੀ ਪਹੁੰਚਾਉਣਾ ਹੈ। ਅਨਾਸਕਤੀ ਨਾਟਕ ਵਿੱਚ ਇਕੋ ਸਮੇਂ ਉੱਤੇ ਇਕ ਕਲਾਕਾਰ ਅਤੇ ਇਕ ਦਰਸ਼ਕ ਦੋਵੇਂ, ਹੋਣ ਵਾਂਗ ਹੈ। ਇਕ ਕਲਾਕਾਰ ਤੋਂ ਇਹ ਆਸ ਕੀਤੀ ਜਾਂਦੀ ਹੈ ਕਿ ਉਹ ਉਸ ਨੂੰ ਦਿੱਤੀ ਗਈ ਭੂਮਿਕਾ ਅਨੁਸਾਰ ਸਮਰਪਣ ਅਤੇ ਆਪਣੀ ਪੂਰੀ ਸਮਰੱਥਾ ਨਾਲ ਕਾਰਜ ਕਰੇ। ਅਜਿਹੀ ਸਮਰੱਥਾ ਪ੍ਰਾਪਤ ਕਰਨ ਲਈ ਇਕ ਵਿਅਕਤੀ ਨੂੰ ਸੰਬੰਧਤ ਕਾਰਜ ਖੇਤਰ ਵਿੱਚ ਆਪਣੀ ਕੁਸ਼ਲਤਾ, ਗਿਆਨ ਆਦਿ ਨੂੰ ਵਧਾਉਂਦੇ ਰਹਿਣਾ ਚਾਹੀਦਾ ਹੈ। ਨਾਲ ਦੀ ਨਾਲ ਉਸ ਨੂੰ ਦਰਸ਼ਕਾਂ ਵਿੱਚ ਬੈਠ ਕੇ ਨਾਟਕ ਨੂੰ ਧਿਆਨ ਪੂਰਵਕ ਵੇਖਦੇ ਹੋਏ ਦਰਸ਼ਕਾਂ ਦਾ ਵੀ ਹਿੱਸਾ ਬਣਨਾ ਚਾਹੀਦਾ ਹੈ। ਜਦੋਂ ਕਿ ਕਲਾਕਾਰ ਦਾ ਹਿੱਸਾ ਬਾਹਰੀ ਦੁਨੀਆਂ ਵਿੱਚ ਸਾਡਾ ਫਰਜ਼ ਹੈ, ਦਰਸ਼ਕ ਸਾਡੇ ਆਪਣੇ ਆਂਤਰਿਕ ਸਵੈ ਦੇ ਲਈ ਹੈ। ਜਦੋਂ ਕਿ ਗੁਣਾਂ ਦੁਆਰਾ ਪ੍ਰੇਰਨਾ ਅਤੇ ਕਾਰਵਾਈ ਦਾ ਸੰਕਲਪ ਆਉਂਦਾ ਹੈ, ਪਰ ਇਨ੍ਹਾਂ ਕਿਰਿਆਵਾਂ ਨੂੰ ਕਰਦੇ ਵਕਤ ਨਿਰਲੇਪਤਾ ਦਾ ਅਭਿਆਸ ਕੀਤਾ ਜਾਣਾ ਚਾਹੀਦਾ ਹੈ। ਜਦੋਂ ਅਸੀਂ ਇਸ ਪ੍ਰਕਿਰਿਆ ਵਿੱਚ ਮੁਹਾਰਤ ਹਾਸਲ ਕਰ ਲਵਾਂਗੇ ਤਾਂ ਸਮਝਿਆ ਜਾ ਸਕਦਾ ਹੈ ਕਿ ਗੀਤਾ ਦੇ ਅਰਥ ਲਾਗੂ ਹੋ ਰਹੇ ਹਨ।
భగవద్గీత అనేది రెండు స్థాయిల యొక్క పొందికైన సమ్మేళనం; భగవద్గీతను అర్థం చేసుకోవడానికి మనం ఈ స్థాయిల గురించి అవగాహన తెచ్చుకోవాలి. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు మానవులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను వివరిస్తూ, అర్జునుడికి స్నేహితుడిగా లేదా మార్గదర్శిగా వస్తారు. కొన్నిసార్లు ఆయన పరమాత్మగా వచ్చి అస్తిత్వాన్ని ఉపదేశిస్తారు. ఆ స్థితిలో ఆయన (4.1) నేను వివస్వతునకు ఈ నాశనం లేని యోగాన్ని ఇచ్చాను అని అంటారు. ఇది రాజ-ఋషులకు వారసత్వంగా అందించబడింది కానీ దాని దృష్టి కాలక్రమేణా కోల్పోయింది అని చెప్పారు (4.2).       'వివస్వతుడు' అంటే సూర్యభగవానుడని అర్ధం; ఆయన కాంతికి రూపకం. శ్రీకృష్ణుడు కాంతి కంటే ముందు తాను ఉన్నానని సూచిస్తున్నారు. ఈ విశ్వం కాంతితో ప్రారంభమై ఆ తర్వాత పదార్థం ఏర్పడిందని విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తుంది.       శ్రీకృష్ణుడు రాజ-ఋషులను ప్రస్తావిస్తున్నప్పుడు వారు వివిధ సమయాలలో జ్ఞానోదయం పొందినవారని అర్ధం చేసుకోవాలి. ఈ జ్ఞానం యొక్క దృష్టి నేడు మాయమైపోయింది ఎందుకంటే కాలక్రమేణా అది అనుభవ స్థాయి నుండి కర్మకాండలు లేదా అనుష్టానాలకు పరిమితం అయ్యింది; తక్కువ అభ్యాసం, ఎక్కువ బోధించడం జరుగుతోంది; మతాలు, సంప్రదాయాల రూపాన్ని తీసుకుంది.       శ్రీకృష్ణుని జన్మ ఇటీవలిది కాబట్టి ఆయన సూర్యుడికి దీనిని ఎలా బోధించాడు అని అర్జునుడు ప్రశ్నిస్తాడు (4.4). మనకు చాలా జన్మలు ఉన్నాయి. నీకు వాటి గురించి తెలియదు కానీ నాకు తెలుసు అని శ్రీకృష్ణుడు సమాధానమిస్తారు (4.5). అర్జునుడి యొక్క ఈ ప్రశ్న మానవ స్థాయిలో చాలా సహజమైనది, తార్కికమైనదిగా అనిపిస్తుంది. ఈ స్థాయిలో, మనం జనన మరణాలను అనుభవింప చేయబడే కాలము యొక్క నియంత్రణలో ఉన్నాము. పుట్టుకకు ముందు; మరణానంతరం ఏమిటనే దానిపై మనకు ఎలాంటి అవగాహన లేదు.       కృష్ణుని సమాధానం కాలాన్ని అధిగమించిన పరమాత్మ స్థాయిలో ఉంది. అంతకుముందు శ్రీకృష్ణుడు ఆత్మ గురించి వివరిస్తూ అది శాశ్వతమైనదని, మనం చిరిగిన దుస్తులను మార్చుకున్నట్లుగా ఆత్మ భౌతిక శరీరాలను మారుస్తుందని చెప్పారు. ఎవరైతే ఆ శాశ్వత స్థితికి చేరుకుంటారో వారు కాలానికి అతీతులు. ఉదాహరణకు, ఒక పువ్వుకు తనలో ఉన్న వికసించే శక్తి గురించి తెలియదు; అయితే ఈ శక్తి, పువ్వు పూయడానికి ముందు ఉన్నది తరువాత కూడా ఉంటుంది.
కోరికలతో నిండి ఉన్న తులసీదాస్ కు తన నూతన భార్యను కలవాలనే బలమైన కోరిక కలిగింది. అతను ఒక శవాన్ని చెక్కదుంగగా భావించి రాత్రి నదిని దాటాడు; గోడపైకి ఎక్కడానికి పామును తాడుగా ఉపయోగించి భార్యను కలిశాడు. రక్తమాంసాలతో నిండిన నా శరీరంపై మీకున్న ప్రేమ, ఒకవేళ రామనామం పై ఉన్నట్లయితే జీవితమనే నదిని ఎప్పుడో దాటి ఉండేవారని ఆయన భార్య అన్నది. అతను ఆ క్షణంలోనే పరివర్తన చెంది పరమ పూజ్యమైన 'రామ్ చరిత్ మానస్' కు రచయితగా మారాడు.  ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కోరికలను నాశనం చేయాలనే కృష్ణుడి సలహా (3.41) ని బాగా అర్థం చేసుకోవడానికి తులసీదాసు కథ మనకు సహాయం చేస్తుంది.  కోరికకు రెండు కోణాలు ఉంటాయి. మొదటిది మనలో ఉత్పన్నమయ్యే అభిరుచి, సంకల్పం, ధైర్యం అనే శక్తి , రెండవది దాని దిశ. ఆ శక్తి బాహ్యంగా నిర్దేశించబడి ఇంద్రియ సుఖాలు, ఆస్తులను కోరుకున్నప్పుడు వాటిని పొందే ప్రయత్నంలో అది వ్యమవుతుంది. కోరికలను నాశనం చేయమని శ్రీకృష్ణుడు మనకు చెప్పినప్పుడు, ఈ శక్తిని మనం నాశనం చేయకూడదని; తులసీదాస్ లాగా మనం అంతరాత్మను చేరుకునేందుకు అంతర్గత యాత్ర కొరకు ఉపయోగించాలని అర్థం. కక్ష్యను చేరుకోవడానికి ప్రారంభంలో రాకెట్ల నుండి శక్తి అవసరమైన ఉపగ్రహం వలే, సాహసోపేతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ శక్తి చాలా అవసరం. ఒకరు శాశ్వత స్థితికి చేరుకున్న తర్వాత శక్తి, దిశ రెండూ అర్థరహితమవుతాయి.       మన శక్తులు మనకి అంతర్గత యాత్రలో సహాయపడాలంటే, మొదట మన ఇంద్రియాలను క్రమశిక్షణలో పెట్టాలని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. ఆయన మనకు సహాయం చేయడానికి ఒక సోపానక్రమాన్ని వివరించారు. విడిభాగాల కంటే మొత్తం గొప్పది కాబట్టి, అన్ని ఇంద్రియాల మొత్తం అయిన మనస్సు ఇంద్రియాల కంటే గొప్పది. మనస్సు పలాయనానికి లేదా పోరాటానికి పరిమితం అవుతుంది కాబట్టి ఇది జంతువుల మనుగడ వరకు సరిపోతుంది. అయితే గొప్పదైన బుద్ధి, జంతువుల నుండి మనలను వేరు చేస్తుంది. అందుకే మనస్సు కంటే ఇది శ్రేష్టమైనది (3.42).       బుద్ది కంటే ఆత్మ ఉత్తమమైనది కాబట్టి మనస్సు లేదా బుద్ధితో జయించడం కష్టతరమైన 'కోరిక' అనే శత్రువును నాశనం చేయడానికి ఆత్మను ఉపయోగించమని శ్రీకృష్ణుడు సలహా ఇస్తున్నారు (3.43).
“పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే ఆవృతమై యుండును (3.38). ఓ అర్జునా! కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయు చుండును” అని శ్రీకృష్ణుడు కామము గురించి హెచ్చరించారు (3.39).  గుణాలకు మనల్ని సమ్మోహితుల్ని చేసే సామర్థ్యం ఉందని ఇంతకు ముందు శ్రీకృష్ణుడు చెప్పారు. రజోగుణం నుండి పుట్టిన కోరిక కూడా అదే చేస్తుంది. “ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాసస్థానములు. ఇది మనోబుద్దీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మోహితునిగా చేయును”అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (3.40).     సాక్షికి అద్దం సరైన ఉదాహరణ. ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా తన ముందుకు తీసుకువచ్చిన పరిస్థితులను, వ్యక్తులను ప్రతిబింబించడమే దీని సామర్థ్యం, జ్ఞానం. ఇది గతం యొక్క భారాన్ని మొయ్యదు లేదా భవిష్యత్తు నుండి ఎటువంటి అపేక్షలు కలిగి ఉండదు; ఎల్లప్పుడూ వర్తమానంలో ఉంటుంది. దుమ్ముతో కప్పబడినప్పుడు మాత్రం దాని సామర్థ్యము తగ్గుతుంది.       అద్దం మన నిజమైన స్వభావం అయితే ధూళి అనేది మన ప్రేరేపిత చర్యలు, కోరికల కారణంగా సేకరించబడిన మన గతం. అదేవిధంగా తెలుసుకునే సామర్థ్యం మన నిజమైన స్వభావం; ఇది అపరిమితమైనది; కానీ మనం సేకరించిన పరిమిత జ్ఞానంతోనే తాదాత్మ్యం చెందుతాము. ఒక్కమాటలో చెప్పాలంటే ధూళి అనేది మన గతం. ఇందులో ఆహ్లాదకరమైన లేదా అసహ్యకరమైన జ్ఞాపకాలు, నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా కామము మన ఆత్మను దాని జ్ఞానాన్ని మరుగుపరచి, భ్రమింపచేస్తుంది.       కార్యాలయంలో, కుటుంబంలో కీలకమైన సంభాషణలను జాగ్రత్తగా పరిశీలిస్తే, మన గతం యొక్క అధిక భారాన్ని మోస్తూ ఉండటం వలన వర్తమానంలోని వాస్తవాలను గ్రహించలేకపోతాము. ఫలితంగా ఉత్పాదకత తగ్గిపోతుంది; అపార్థాలకు దారి తీస్తుంది.       గతంలో జీవించడం దుఃఖం. గతం మనల్ని దానికి బానిసలుగా చేయనివ్వకూడదు. కానీ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభంలో గతం యొక్క కొన్ని అనుభవాలను ఉపయోగించుకొని వర్తమానంలో స్పృహలో జీవించడం నేర్చుకోవచ్చు.
      “ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా, దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయు చుండును?” అని అర్జునుడు అడిగాడు (3.36).       “రజోగుణమునుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది గాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియేప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమ శత్రువుగా ఎఱుంగుము.” అని శ్రీకృష్ణుడు చెప్పారు (3.37).       శ్రీకృష్ణుడు కామం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే కోరిక యొక్క తీవ్ర రూపం. కర్మతో అనుబంధం అనేది రజోగుణం యొక్క ముఖ్య లక్షణం. ఉదాహరణకి ఒక వాహనం విషయంలో కదలిక లేదా వేగం అనేది రజోగుణం నుండి పుట్టిన గుణం; దీనిని సాధించడానికి యాక్సిలరేటర్ ఒక పరికరం. అదే విధంగా మందగించడం లేదా జడత్వం తమస్సు యొక్క స్వభావం; దీని కోసం బ్రేక్ ఒక పరికరం. డ్రైవర్ సత్వగుణానికి ప్రతినిధి; సురక్షితంగా వెళ్లడానికి త్వరణం, బ్రేకింగ్ ని సంతులనం చేస్తాడు. స్పీడోమీటర్ అనేది అవగాహన కోసం ఒక పరికరం. వీటి మధ్య సంతులనం తప్పిపోతే ప్రమాదం తప్పదు.       కామం కూడా మన జీవితాల్లో సమతుల్యత కోల్పోవడం తప్ప మరొకటి కాదు. మనం సుఖాన్ని పొందేందుకు, ఏదైనా వస్తువును కలిగి ఉండటానికి, ఎవరైనా వ్యక్తితో కలిసి ఉండటానికి, అధికారం, కీర్తిని పొందడానికి చాలా శక్తిని వెచ్చిస్తాము. ఈ కోరికలకు శక్తిని ఇస్తున్నప్పుడు వాటి పర్యవసానాల గురించి మనకు పూర్తిగా తెలియదు. ఒకసారి అది సరిహద్దు దాటిన తర్వాత మనకు ఈ కోరికల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. నెరవేరని కోరిక క్రోధాన్ని తీసుకు వస్తుంది. అట్లాగే సుఖం వెనుక దుఃఖం ఎల్లప్పుడూ దాగి ఉంటుంది. ఎందుకంటే, ఈ రెండూ ద్వంద్వము యొక్క ధ్రువాలు కనుక. ఆ సుఖం తరువాత వచ్చే దుఃఖమే క్రోధంగా వ్యక్తమవుతుంది.       కోరికలు ఎప్పుడూ తృప్తి చెందవని ఈ శ్లోకం సూచిస్తుంది. మనం వాటిని సంతృప్తి పరచడానికి ఎంత ప్రయత్నిస్తే అవి అంత ఎక్కువగా పెరుగుతాయని అర్ధము. ధనవంతుడు మరిన్ని సంపదలను కోరుకుంటాడు; శక్తిమంతుడు నిరంకుశమైన శక్తిని కోరుకుంటాడు; వాటిని అణచివేయడం లేదా సంతృప్తి పరచడం అనేది ఉపాయం కాదు. మనము కామం లేదా భయం యొక్క కోరల్లో చిక్కుబడ్డప్పుడు వాటి పట్ల అవగాహన వహించమని, ఈ అవగాహనే వాటి పట్టు నుండి మనల్ని విడిపిస్తుందని శ్రీకృష్ణుడు చెప్తున్నారు.
      “పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మము నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మముకంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణము నందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము” అని శ్రీకృష్ణుడు చెప్పారు (3.35). ఈ క్లిష్టమైన బోధన మన మనస్సులో స్పష్టత కంటే ఎక్కువ సందేహాలను సృష్టించే అవకాశం ఉంది.       ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్లోకం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి పరిస్థితికి సందర్భోచితమైనది. అర్జునుడిలో ఆ క్షణం వరకు యోధుల ధర్మమే ఉంది, తరువాతి క్షణంలో సన్యాసి కావాలని కోరుకుంటాడు. ఈ మార్పుకు అవకాశము లేదు కనుక శ్రీకృష్ణుడు ఈ పద్యంలో అదే విషయాన్ని సూచిస్తున్నారు.       ధర్మం ఒకటే అయినా మనం దాన్ని అనేక విధాలుగా చూస్తాము. ఐదుగురు అంధులు ఒకే ఏనుగును తమ స్పర్శ ద్వారా ఎలా విభిన్నంగా గ్రహించారో, ధర్మము గురించి పాక్షిక అవగాహన అలాగే ఉంటుంది. వారిలో ఒకరు దానిని దంతంగా గ్రహిస్తే, అది అతని వాస్తవికత లేదా స్వధర్మం. ఏనుగును దంతంగా భావించే వ్యక్తి, ఏనుగును కాలు లేదా తోకగా భావించిన వ్యక్తి యొక్క సుందరంగా వర్ణింపబడిన అభిప్రాయాన్ని స్వీకరించడానికి ప్రయత్నించకుండా తన మార్గాన్ని అనుసరించాలని ఈ శ్లోకం సూచిస్తుంది.       ఎవరి అభిప్రాయము సరైనది అనేది తదుపరి ప్రశ్న. ఏనుగు భాగాలను తడిమిన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేసిన అభిప్రాయము వాళ్ళ దృష్టిలో వాస్తవమే. అందుకే గుణరహితమైనా స్వధర్మాన్ని అనుసరించండి అని శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు, ఇతరుల ధర్మాలతో పోలికను ప్రోత్సహించలేదు.       ధర్మం అనేది మన ఇళ్లలోకి ప్రవేశించే విద్యుత్తును పోలి ఉంటుంది. అది దాన్ని ఉపయోగించే ఉపకరణాన్ని బట్టి విభిన్నంగా వ్యక్తమవుతుంది. ప్రతి పరికరం దాని స్వంత స్వభావాన్ని కలిగి ఉంటుంది; టీవీ అవ్వాలనే ఫ్యాన్ కనే కలలు నిజం కావు కదా!       అణచివేత మనల్ని ఎక్కడికీ తీసుకువెళ్లదని శ్రీకృష్ణుడు అంతకు ముందుగానే సూచించారు (3.33). పరధర్మాన్ని స్వీకరించడం అనేది తన స్వధర్మాన్ని అణచివేయడం. అణచివేత విభజనకు దారితీస్తుంది; అంధులు, ఏనుగుల విషయంలో లాగా వాస్తవికత అనేది అన్ని వ్యక్తిగత అవగాహనల సారం.
      “అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, జ్వరం, ఆశా మమతా సంతాపములను వీడి యుద్ధము చేయుము” అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు (3.30). ఈ శ్లోకం భగవద్గీత యొక్క సారాంశం; ఇది రోజువారీ జీవితంలో మన సందేహాలకు సమాధానం ఇస్తుంది.       మన మొదటి సందేహం 'ఏం చెయ్యాలి' అనేది. సామాన్యంగా మనం చేసే పనిలో మనకు సంతృప్తి లేకపోవటం వల్ల, ఇంకేదో పనిలో సుఖం ఉంటుందని మనకు అనిపిస్తుంది. కానీ ఈ శ్లోకం 'చేతిలో ఉన్న పనిని చేయమని' సలహా ఇస్తుంది. ఆ పని మనం కోరుకున్నది కావచ్చు లేదా మనకు ఈ ప్రకృతి కేటాయించింది కావచ్చు. అది ఒకరినొకరు చంపుకునే కురుక్షేత్ర యుద్ధం వలె క్రూరమైనది, సంక్లిష్టమైనది కావచ్చు. శాస్త్రీయంగా, మన సంక్లిష్ట మానవ శరీరం ఒక కణం నుండి పరిణామం చెందింది; ఇక్కడ ప్రతి కర్మ (మ్యుటేషన్) మునుపటి దానితో ముడిపడి ఉంటుంది. కనుక చేతిలో ఉన్న ఏ కర్మ ఒంటరిగా ఉండదు; ఎల్లప్పుడూ గత కర్మల శృంఖలాల ఫలితంగా ఉంటుంది. గత కర్మల గురించి మనము చేయగలిగినది ఏమీ లేదు.       తదుపరి ప్రశ్న, 'చేతిలో ఉన్న పని ఎలా చేయాలి'. అహంకారాన్ని, కోరికలను వదలి పని చేయమని ఈ శ్లోకము మనకు సలహా ఇస్తుంది. అర్జునుడి విషాదము వలన వచ్చిన జ్వరము వంటి జ్వరాలను కూడా వదిలేయాలని చెబుతుంది. కోరికలు వదిలేయడం తోనే మనకు దుఃఖం నుండి విముక్తి కలిగిస్తుంది; ఎందుకంటే కోరికలు, దుఃఖం ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. 'మనకు ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలి' అన్న ప్రశ్నకు భగవానుడైన శ్రీకృష్ణుడు అన్ని చర్యలను, బాధలను తనపై విడిచి పెట్టమని సలహా ఇచ్చారు. చేతిలో ఉన్న పని సంక్లిష్టమైనది అయినప్పుడు మనం మనకంటే అదనపు వనరులను కలిగి ఉన్నవారి నుండి సహకారం కోరుకుంటాము. ఆ సహకారం అనుభవపరంగా గాని జ్ఞానపరంగా గాని అవ్వచ్చు. మన పరిధికి మించిన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మనల్ని మనం ఆ పరమశక్తి మంతుడైన పరమాత్మునికి సమర్పించుకోవడమే ఉత్తమము. అదే మోక్షము.       అహంకారం బలహీనతకు, భయానికి సంకేతం, దాని అస్తిత్వం కోసం సంపదలు, గుర్తింపును కోరుతుంది. ఈ అహంకారాన్ని దాటి పరమాత్మ పై సర్వస్వాన్ని విడిచిపెట్టడానికి ధైర్యం, నిర్భయత అవసరం.
“ప్రకృతిగుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానముగల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు (ఊగిసలాటకు) గురి చేయరాదు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (3.29).       మన కర్మలకు అసలైన కర్త అవడమే కాకుండా సత్త్వ, రజో, తమో గుణాలకు మన నిజమైన స్వభావాన్ని మరచిపోయేలా చేసి మనను మంత్రముగ్ధులను చేయగల సామర్థ్యం ఉంది. మనం వీటి మాయ యొక్క అధీనంలో ఉన్నామని గ్రహించే వరకు మనం మంత్రముగ్ధులమై ఉంటాము.       శ్రీకృష్ణుడు అజ్ఞానులు, జ్ఞానుల గురించి చెబుతారు. అజ్ఞానులు గుణాల యొక్క మంత్రముగ్ధతలో ఉండి తాము కర్తలమని భావిస్తారు; ఏదో సాధించాలని, గొప్ప వారిగా ఉండాలని, సమాజంలో గుర్తించ బడాలని, అధికారం కావాలని కోరుకుంటారు (3.27). అదే సమయంలో వారు కుటుంబం, కార్యాలయం, సమాజంలో ఇతరులను కూడా కర్తగా భావిస్తారు; వారు అందరూ తమ అంచనాలకు అనుగుణంగా ప్రవర్తించాలని లేదా పని చేయాలని ఆశిస్తారు. ఈ పరిస్థితి నుంచి ఉత్పన్నమయ్యే విజయాలు, వైఫల్యాలు ఎప్పుడూ ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. దాని మూలంగా అపరాధం, పశ్చాత్తాపం, కోపం, కష్టాలకు లోనవుతారు.       ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క రెండవ దశలో ఒక ఘటన జరిగిన కొంతకాలం తర్వాత అవగాహన రావడం; ఈ అవగాహన కొన్ని క్షణాలు, సంవత్సరాలు, దశాబ్దాలు లేదా జీవితకాలం తర్వాత రావచ్చు. సంఘటనలు మన పై ఉన్న గుణాల ప్రభావం వలన మనం మాట్లాడే మాటలు కావచ్చు, మనం తీసుకునే నిర్ణయాలు లేదా మనం చేసే కర్మలు కావచ్చని గమనించాల్సివుంది.       ఆఖరి దశలో, వర్తమాన క్షణంలోనే మనము కర్త కాదని; వాస్తవంగా, “కర్మలు అన్నియును ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును” అని గ్రహించడం (3.27). ఇది సాక్షిగా ఉండగలిగే ఒక కళ.       అజ్ఞాని కూడా కాలక్రమేణా వారి స్వధర్మం ప్రకారం ఈ అవగాహన స్థితికి చేరుకుంటారు. అందువల్ల అజ్ఞానులకు భంగం కలిగించకుండా వేచి ఉండమని శ్రీకృష్ణుడు జ్ఞానులకు సలహా ఇస్తారు.       మనమందరం మనం జీవిస్తున్న ప్రపంచం గురించి అనేక అపోహలు, మూఢనమ్మకాలను కలిగి ఉంటాము; అజ్ఞానులు వాటి యొక్క ఖైదీలు. వీటిని అధిగమించడమే మోక్షం.
      “వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతః కరణముగల అజ్ఞాని) “ఈ కర్మలకు నేనే కర్తను' అని భావించును. కానీ, గుణ విభాగ తత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటియందు ఆసక్తుడు కాడు” అని కృష్ణ భగవానుడు విశదీకరించారు (3.27, 3.28).  భగవద్గీత యొక్క మూలోపదేశం ఏమిటంటే ఏ కర్మలకు మనం కర్త కాదు. మనలోని, ఇతరులలోని గుణాల మధ్య పరస్పర ప్రభావం వలన కర్మలు జరుగుతాయి. సత్వ, తమో, రజో అనే మూడు గుణాలు మనలోని ప్రతి ఒక్కరిలోనూ వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. సత్వగుణం జ్ఞానానికి అనుబంధం, రజోగుణం అనేది కర్మతో అనుబంధం; తమస్సు అజ్ఞానానికి, సోమరితనానికి దారి తీస్తుంది.  ఏ గుణమూ ఇంకొక గుణము కంటే గొప్పది లేదా తక్కువ కాదు అని గమనించాలి. అవి కేవలం గుణాలు. ఉదాహరణకు, ఒక వ్యక్తిలో రజోగుణం ఎక్కువగా ఉన్నట్లయితే, వారు పనుల పట్ల గాఢంగా మొగ్గు చూపుతారు; నిద్రపోలేరు కాబట్టి నిద్రించడానికి తమస్సు గుణం అవసరం.  రెండవది, ప్రస్తుత తరుణంలో మనల్ని శాసిస్తున్న గుణం గురించి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు, తమస్సు ప్రభావంతో ఒకరు బద్ధకంతో సోఫా పై కూర్చుని, టివి చూడడానికి ఇష్టపడతారు. మరోవైపు, వారి జీవిత భాగస్వామి రజోగుణంలో ఉన్నట్లయితే అతను/ ఆమె ఏదైనా షాపింగ్, సినిమా, స్నేహితులను సందర్శించడం మొదలైన వాటి కోసం బయటకు వెళ్లాలని కోరుకుంటారు. తమో, రజోగుణాల మధ్య పరస్పర సంపర్కం మీద తదుపరి పరిస్థితులు ఆధారపడతాయి. గుణాల పరస్పర సంపర్కము తో నడిచే ఇలాంటి పరిస్థితులు మనం పనిచేసే కార్యాలయాల్లో కూడా సంభవిస్తాయి.       “మనం గుణాతీతులుగా మారడానికి గుణాలను అధిగమించ గలగాలి” (14.22-14.26) అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు అంటే ప్రస్తుత క్షణంలో మనపై, ఇతరులపై ఆధిపత్యం చెలాయించే గుణాల గురించి అవగాహన కలిగి వాటి పరస్పర సంపర్కాలకు మనం కేవలం సాక్షిగా మిగిలిపోవడం.
ఒక కాయ చెట్టు నుండి పోషకాలను గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది. తరువాత అది తన స్వంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చెట్టు నుండి వేరు అవుతుంది. విత్తనము నుంచి చివరకు చెట్టుగా మారేవరకు, వివిధ దశలను కలిగి ఉంటుంది. మరోవైపు, అపరిపక్వ కాయ పండే వరకు, అంటే తన యాత్రను స్వయంగా ఆరంభించే దక్షత వచ్చేవరకు చెట్టుకు అంటిపెట్టుకుని ఉండాలి. పండిన పండు, అపరిపక్వమైన కాయను చెట్టును విడిచి పెట్టడానికి ఆకర్షించకూడదు ఎందుకంటే అపరిపక్వ కాయ స్వతంత్ర ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇంకా సిద్ధంగా లేదు. మాతృచెట్టు నుండి అవసరమైన పోషణ పొందడానికి సమయం కేటాయించకపోతే అది నశిస్తుంది. ఈ పోషణ పండిన పండు నుంచి పొందే అవకాశం లేదు. ఇదే పంథాలో, శ్రీకృష్ణుడు పరమాత్మస్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో (ఫలాసక్తితో) ఆచరించు అజ్ఞానులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా, తాను కూడ శాస్త్ర విహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను” అని సలహా ఇస్తారు (3.26).  ఇది కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించే వ్యక్తుల గురించి శ్రీకృష్ణుడు చెప్పిన 3.6 వ శ్లోకానికి యొక్క కొనసాగింపు. అలా నియంత్రించిన తర్వాత వారి మనస్సు ఇంద్రియ వస్తువుల ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటే వారు తమను తాము మోసగించుకునే కపటులని శ్రీకృష్ణుడు పిలుస్తారు. ఒక జ్ఞాని, బలవంతంగా ఒక అజ్ఞాని చేత పనులను నిలువరించినప్పటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. వంద మంది విద్యార్థులున్న తరగతిలో, ఒక్కొక్కరు పాఠాన్ని వారి వారి స్వభావం, మానసిక స్థితిని బట్టి ఒక్కో విధంగా అర్ధం చేసుకుంటారు. అందుకే, జీవితంలో ప్రేరేపిత కర్మల యొక్క వ్యర్ధతను గ్రహించిన సన్యాసి, బ్రహ్మచారిని కుటుంబ జీవితం నుండి వైదొలగమని ప్రోత్సహించకూడదు. ఎందుకంటే బ్రహ్మచారి తన స్వంత కర్మల ద్వారా అదే వ్యర్ధతను బాగా అర్థం చేసుకోవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు.    శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించడానికి అర్జునుడిలో నేర్చుకోవాలనే కుతూహలం కోసం ఎదురుచూశాడు. అప్పటి వరకు, శ్రీకృష్ణుడు అతన్ని ప్రాపంచిక క్రియలు చేస్తూనే ఉండనిచ్చారు, జీవితంలో సుఖదుఃఖాలు అనుభవించనిచ్చారు; అనుకూలమైన క్షణం కోసం వేచి ఉన్నారు. అంతర్గతకుతూహలం జన్మించినప్పుడే మనం చూసే ప్రతి వాస్తవికత, మనం ఎదుర్కొనే ప్రతి జీవిత పరిస్థితి గురువుగా మారగల అవకాశం ఉంది; అటువంటి సమయంలోనే నేర్చుకోవడం సాధ్యం అవుతుంది.
మన దైనందిన జీవితంలో కొన్ని పనులను ఇష్టంగా చేస్తాము. దీనినే ఆసక్తి అంటాము. ఇష్టం లేని పనులను చేయడానికి విముఖతను చూపిస్తాము. దీనిని విరక్తి అంటాము. ఈ రెండు స్థితులలో మనము జీవితం గడుపుతాము. శ్రీకృష్ణుడు 'అనాసక్తి' అనే మూడవ స్థితిని సూచిస్తారు; అనాసక్తి, అంటే ఆసక్తి, విరక్తి రెండింటినీ అధిగమించడం. “అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు (జ్ఞాని) కూడా లోకహితార్థమై అనాసక్తుడై కర్మలను ఆచరింపవలెను” అని శ్రీకృష్ణుడు బోధించారు (3.25).       ఆసక్తి, విరక్తి పై ఆధారపడిన కర్మలు మనల్ని దయనీయంగా మారుస్తాయి. ప్రియమైన వ్యక్తి (ఆసక్తి) మన దగ్గర ఉంటే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది; వారు లేకపోవడం మనల్ని అసంతృప్తికి గురి చేస్తుంది. అదేవిధంగా, అసహ్యించుకునే వ్యక్తి (విరక్తి) ఉండటం మనల్ని అసంతృప్తికి గురి చేస్తుంది; వారు లేకపోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆసక్తి లేదా విరక్తి రెండూ మనల్ని సుఖం, దుఃఖం యొక్క ద్వంద్వాల మధ్య ఊగిసలాడించగలవు అని ఈ ఉదాహరణ సూచిస్తుంది. కాబట్టి, శ్రీకృష్ణుడు, ఏదైనా పని చేసేటప్పుడు రెండింటినీ అధిగమించి అనాసక్తుడిగా ఉండమని సలహా ఇస్తున్నారు.       లోక కళ్యాణం కోసం అనాసక్తితో కార్యాలు నిర్వహించడాన్ని కరుణ భావనతో పోల్చవచ్చు. ఆసక్తి లేదా విరక్తితో పనులు చేసినప్పుడు, అది మురికిని తోలే చెత్త బండిలా, దుర్గంధాన్ని వ్యాపింప చేసి తద్వారా సమాజ సంక్షేమానికి హాని కలుగిస్తుంది.       అనాసక్తి అనేది నాటకంలో నటునిగానూ అదే సమయంలో ప్రేక్షకులలో భాగమైనట్లుగానూ ఉంటుంది. ఒక కళాకారుడు తనకు కేటాయించిన పాత్రను అంకితభావంతో, తన సామర్థ్యం మేరకు పోషించాలని భావిస్తాడు. అదే సమయంలో నాటకాన్ని గమనిస్తూ, హాల్ లోని ప్రేక్షకులలో కూడా భాగమై ఉండాలి. మొదటి భాగం బాహ్య ప్రపంచంలో మన కర్తవ్యం అయితే, రెండోది మన అంత రంగానికి సంబంధించిన స్వవిషయం. అలాగే జీవితమనే రంగస్థలంలో మనకివ్వబడిన పాత్రను పోషించడానికి సంబంధిత కార్య రంగంలో మన నైపుణ్యాలు, జ్ఞానం మొదలైన వాటిని పెంచుకుంటూ ఉండాలి. కర్మ యొక్క ఎంపిక, ప్రేరణ ప్రకృతి జనితమైన త్రిగుణాల నుండి వచ్చినప్పటికీ, ఈ కర్మలను చేసేటప్పుడు అనాసక్తి తో ఆచరించాలి. ఈ ప్రక్రియలో మనం ప్రావీణ్యం పొందడమే భగవద్గీతను అమలు చేయడం.
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలు ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకత్వం కోసం చూస్తారు; కొత్త విషయాలు, మర్యాదలు, ప్రవర్తనలు మొదలైన వాటిని నేర్చుకుంటారు. మన మాటలకు, చేతలకు మధ్య సామరస్యముతో వారికి ఉదాహరణగా నిలుస్తూ ఉండడమే పిల్లల్ని పెంచడానికి ఉత్తమ మార్గము. తరువాత స్నేహితులు, ఉపాధ్యాయులు, సలహాదారులు మొదలైన వారిపై ఆధారపడటం కొనసాగుతుంది. అదే విధంగా మన పై ఆధారపడే వ్యక్తులు, మార్గదర్శకత్వం కోసం మన వైపు చూసే వ్యక్తులు ఉంటారని ఇది సూచిస్తుంది. మనం ఏం చేసినా అది వారి పై ప్రభావం చూపుతుంది. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు “శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే (ప్రవర్తననే ఇతరులును అనుసరింతురు. అతడు నిల్పిన (ప్రతిష్ఠించిన) ప్రమాణములనే లోకులందరును పాటించెదరు” (3.21). శ్రీకృష్ణుడు ఇంకా వివరిస్తారు, “ఓ అర్జునా! ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను (3.22). ఓ పార్థా! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్పహాని సంభవించును. ఎందుకనగా, మనుష్యులందఱును అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు (3.23). నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును. అంతేగాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను” (3.24). శ్రీకృష్ణుడు పరమాత్మ స్థాయి నుంచి ఈ విషయాలను మనకు తెలియపరుస్తున్నారు. ఆయన సృష్టి, నిర్వహణ, విధ్వంసంతో కూడిన సృజనాత్మకత స్థాయి నుంచి బోధిస్తున్నారు. ఈ శ్లోకాలలో సృజనాత్మకత తన చర్యను ఆపివేస్తే వచ్చే పరిణామాల గురించి శ్రీకృష్ణుడు పేర్కొన్నారు. ఒక రైతు విత్తనాలను విత్తినప్పుడు అవి మొలకెత్తడానికి కారణం సృజనాత్మకత. సృజనాత్మకత ఆగిపోతే, విత్తనాలు వృధా అవుతాయి. మొలకెత్తిన తర్వాత ఆ పంట ఎదగకపోతే, అది కూడా గందరగోళానికి కారణం. పెరిగిన తర్వాత పంట పండకపోతే అది ముందు తరాలను నాశనం చేస్తుంది. ఈ ఉదాహరణ ద్వారా శ్రీకృష్ణుడి సంబోధనాన్ని అర్ధం చేసుకోవడం సులభం అవుతుంది.       ఈ విశ్వంలో నిర్మించబడిన కనిపించే మరియు కనిపించని స్వయంచాలకత్వంపై మన జీవితాలు ఎంతో ఆధారపడి ఉన్నాయి. సృజనాత్మకత ద్వారా అలసిపోకుండా నిరంతరం నిర్వహించబడే అనేక కార్యాల కారణంగానే ఇది సాధ్యమవుతుంది.
అనాసక్తుడై కర్తవ్యకర్మలను ఆచరించు మనుష్యుడు అత్యున్నత స్థితికి చేరుకుంటాడని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నారు (3.19). అనాసక్తుడిగా ఆసక్తి, విరక్తి రెండిటిని వదిలివేసిన వాడు; కర్మ ద్వారా మాత్రమే పరిపూర్ణతను పొందినవాడు అయిన జనక మహారాజు ఉదాహరణను ఇస్తారు (3.20). విలాసాలలో నివసించేవాడు, అనేక బాధ్యతలను కలిగి ఉన్న వాడైన మహారాజు కూడా అనాసక్తుడై అన్ని చర్యలను చేయడం ద్వారా స్వతృష్ట స్థితిని పొందగలడనే విషయాన్ని శ్రీకృష్ణుడు నొక్కిచెప్పారు. పరిస్థితులతో సంబంధం లేకుండా మనం కూడా అదే విధంగా ఉన్నత స్థితిని చేరుకోగలమని ఇది సూచిస్తుంది. చరిత్రలో, ఇద్దరు జ్ఞానులు పరస్పరం సంభాషించిన సందర్భాలు చాలా తక్కువ. జనక మహారాజు, అష్టావక్ర ఋషి మధ్య అలాంటి సంభాషణనే, 'అష్టావక్ర భగవద్గీత' అని పిలుస్తారు. ఇది సాధకులకు ఉపయోగపడే ఉత్తమమైన సంభాషణ అని చెప్పబడింది. ఒకసారి ఒక గురువు గారు గోచీ, భిక్షాపాత్రతో ఉన్న తన శిష్యుడొకరిని చివరి పాఠం కోసం జనకుని వద్దకు పంపాడు. అతను జనకుని వద్దకు వచ్చి, తన గురువు తనను విలాసాల మధ్య ఉన్న ఈ వ్యక్తి వద్దకు ఎందుకు పంపించాడా అని ఆశ్చర్యపోతాడు. ఒకరోజు ఉదయం జనకుడు అతన్ని స్నానానికి దగ్గర్లోని నదికి తీసుకెళతాడు. స్నానం చేస్తుండగా రాజభవనం కాలిపోయిందనే వార్త వస్తుంది. విద్యార్ధి తన గోచీ గురించి ఆందోళన చెందుతాడు అయితే జనకుడు రాజభవనం గురించి ఏ మాత్రమూ కలవరపడలేదు. ఒక సాధారణ గోచీతో కూడా అనుబంధం అనేది అనుబంధమేననీ; దానిని వదిలివేయాల్సిన అవసరం ఉందని ఆ క్షణంలో ఆ శిష్యుడు గ్రహించాడు. అనాసక్తితో కర్మలు చేయడం భగవద్గీత యొక్క ప్రధాన బోధన. ఇది ఆసక్తి విరక్తుల యొక్క ప్రత్యేక సంగమం. దీని అర్ధం ఏమిటంటే ఒక వ్యక్తి పూర్తిగా బాధ్యత వహించి, వర్తమాన పరిస్థితిలో తన వంతు సర్వశ్రేష్ట కృషి చేయడం. బాధ్యతలను నిర్వహించడానికి చేసే పని యొక్క ఫలితం అనేది చేసిన ప్రయత్నాలను బట్టి ఉండవచ్చు లేదా అది పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు. ఎలాంటి సందర్భంలో అయినా అతను ఆందోళన చెందడు లేదా కలవరపడడు. అదే సమయంలో, ఆ చర్యల ఫలితం అతనిని ప్రభావితం చేయనందున అతను అంతర్గతంగా సంబద్ధుడై ఉంటాడు. ఆధునిక యుగంలో పని-జీవిత (వర్క్-లైఫ్) సమతుల్యతను కాపాడుకోవడానికి ఇది కీలకమైన మార్గము.
జీవించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి 'సంఘర్షణ', మరొకటి 'సమర్పణ'. సమర్పణ అనేది యుద్ధంలో ఓడిపోయిన వారి లొంగుబాటు వంటి నిస్సహాయత కాదు. ఇది అవగాహనతో, క్రియాశీలమైన అంగీకారంతో సమర్పించుకోవడం. ఇతరులను దాటిపోవాలనుకునే కోరిక; భగవంతుడు మనకిచ్చిన దానికంటే అధికంగా పొందాలనుకోవడం; మన దగ్గర ఉన్నదానికంటే భిన్నమైన దాన్ని కలిగి ఉండాలనుకోవడమే సంఘర్షణ. మరోవైపు, సమర్పణ ప్రతి సజీవ క్షణానికి కృతజ్ఞత. “ఎవరైతే ఇంద్రియాల ద్వారా భోగాలలో రమించి, సృష్టిచక్రాన్ని అనుసరించి చరించరో అతని జీవితం వ్యర్ధం” అని శ్రీకృష్ణుడు ఉద్ఘాటించారు (3.16). ఈ ఇంద్రియాలను సంతృప్తిపరిచే మార్గంలో పయనించే ఎవరికైనా జీవితము సంఘర్షణ మయము. ఎందుకంటే అవి ఎప్పటికీ సంతృప్తి చెందవు. ఇది పోరాటం, ఉద్రిక్తత, ఆందోళన మరియు కష్టాలను తెచ్చే వ్యర్ధ జీవితం. శ్రీకృష్ణుడు వర్షం యొక్క ఉదాహరణను ఉపయోగించి సృష్టిచక్రాన్ని వివరిస్తారు (3.14). 'వర్షం' నీటి యొక్క నిస్వార్ధ కర్మ రూపం; ఇందులో నీరు ఆవిరైపోతుంది; నిస్వార్ధంగా వర్షం రూపంలో కురుస్తుంది. అటువంటి నిస్వార్ధ కర్మలే సర్వోన్నత శక్తికి మూలం (3.15). నిస్వార్ధ కర్మల చక్రాన్ని అనుసరించడమే సమర్పణాయుత జీవితం; ఇది మనల్ని ఆనందమయం చేస్తుంది. “స్వయం తో ఆనందించే వ్యక్తి ఆత్మ లోనే తృప్తి చెందుతాడు; ఆత్మలోనే ఆనందం పొందుతాడు; అతనికి ఎటువంటి కర్తవ్యం ఉండదు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (3.17). ఇది ఇంద్రియాల నుండి స్వతంత్రమైన జీవితం, ఇక్కడ ఒక వ్యక్తికి అస్తిత్వము కంటే వేరే కోరికలు ఉండవు. అస్తిత్వం యొక్క కోరికే మన కోరిక అయినప్పుడు మనకు వేరే కర్తవ్యం ఏమీ ఉండదు. అంటే నిస్వార్ధ కర్మలను చేస్తూ మనకు ఇవ్వబడిన ప్రతిదానిని మనస్ఫూర్తిగా అంగీకరించడం. “అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను, చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనమూ ఉండదు. అతనికి సర్వప్రాణుల తోడను స్వార్థపరమైన సంబంధము ఏవిధముగను ఏమాత్రము ఉండదు” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (3.18). 'స్వయంతో సంతృప్తి' అనేది భగవద్గీతలో ఒక మౌలిక ఉపదేశం. ఇది స్వయంతో ఆనందంగా ఉండడం, ఆత్మ సంతృప్తిని కలిగి ఉండడం. ఒక వ్యక్తి స్వయంతో సంతృప్తి చెందితే మన అర్హతలు, సామర్ధ్యాల గురించి ఎటువంటి ఫిర్యాదులు లేదా పోటీలు ఉండవు.
భూమిపై జీవానికి నీరు చాలా అవసరం. నిస్వార్థ చర్యలను వివరించడానికి శ్రీకృష్ణుడు వర్షాన్ని ఉదాహరణగా ఉపయోగిస్తారు (3.14). వేడి కారణంగా నీరు ఆవిరైపోయి మేఘాలు ఏర్పడతాయి. సరైన పరిస్థితుల్లో అది వర్షంగా తిరిగి వస్తుంది. దీని అర్థం ఏంటంటే వర్షం అనేది చక్రంలోని ఒక భాగం. ఈ ప్రక్రియలోని నిస్వార్ధ కర్మలను, శ్రీకృష్ణుడు 'యజ్ఞం' అని అంటారు. మహాసముద్రాలు నీటిని ఆవిరి చేసి మేఘాలు ఏర్పడడానికి హాయపడతాయి; మేఘాలు వర్షంగా మారడానికి తమను తాము త్యాగం చేస్తాయి. ఈ రెండూ యజ్ఞరూపమైన నిస్వార్ధ కర్మలు. యజ్ఞం రూపమైన నిస్వార్ధ కర్మలు అస్థిత్వము యొక్క అత్యున్నత శక్తిని కలిగి ఉంటాయని (3.15) శ్రీకృష్ణుడు సూచించారు. ప్రారంభంలో ఈ శక్తిని ఉపయోగించి సృష్టికర్త సృష్టిని చేసారు (3. 10), ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించి పరమ శ్రేయస్సును పొందమని ఆయన సలహా ఇచ్చారు (3.11). ఇది యజ్ఞ రూపమైన నిస్వార్ధ కర్మ ద్వారా అస్థిత్వముతో మనల్ని మనం సంలీనము చేసుకుని, దాని శక్తిని ఉపయోగించు కోవడమే. వర్షం యొక్క ఈ పరస్పర అనుసంధాన ప్రక్రియలో మేఘాలు గర్వపడి నీటిని నిల్వ చేసుకుంటే చక్రం భంగపడుతుంది. ఈ చక్రాలకు భంగం కలిగిస్తూ ఈ విధంగా జమ చేసేవారిని శ్రీకృష్ణుడు దొంగలు అని పిలుస్తారు (3.12). మరోవైపు, వర్షం యొక్క నిస్వార్ధ కర్మ కొనసాగినప్పుడు మేఘాలు మరలా మరలా ఏర్పడుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు, ఈ చక్రంలో ఒకరికొకరు సహాయం చేసుకునే వారి కోసం 'దేవత' అనే పదాన్ని ఉపయోగిస్తారు (3.11). ఈ నిస్వార్ధ కర్మలు, సముద్రం వర్షం ద్వారా నీటిని తిరిగి పొందినట్లుగా, ఎన్నింటినో తిరిగి ఇస్తాయి. కాబట్టి జమచేసుకోకుండా ఈ చక్రంలో పాల్గొనండి; ఇది అన్ని పాపాల నుండి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. జమచేసుకోవడమే అనేదే అసలు పాపం అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (3.13). “స్వార్ధ కర్మలు మనలను కర్మబంధనంలో బంధిస్తాయని” శ్రీకృష్ణుడు హెచ్చరించారు (3.9). యజ్ఞంలా అనుబంధం లేకుండా కర్మలను నిర్వహించమని సలహా ఇస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ఒకరిపై ఒకరు ఆధారపడటం తప్ప మరో మార్గం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒకజీవి ఒక చక్రంలో లేదా మరొకదానిలో భాగం; ఏదో వస్తువుపై లేదా మరొకరిపై ఆధారపడి ఉంటుంది. మనలో ఒక భాగం ఇతరులలో, ఇతరులలోని కొంత భాగం మనలో ఉందనే అవగాహన కీలకం.
“నీవు శాస్త్ర విహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణముగూడ సాధ్యము గాదు” అని శ్రీకృష్ణుడు తత్వాన్ని విశదీకరించారు (3.8). ఆహారాన్ని సేకరించడం, భోజనం చేయడం వంటి చర్యలు మానవ శరీరం యొక్క మనుగడకు అవసరం. మానవ శరీరం అనేక అవయవాలు, వ్యవస్థలు, రసాయనాలను కలిగి ఉంటుంది. ఇవి క్రమం తప్పకుండా వేలాది అంతర్గత చర్యలను చేస్తూ ఉంటాయి. వాటిలో ఒక్కడి తప్పిపోయినా సామరస్యం పోయి, శరీరం రోగగ్రస్త మవుతుంది లేదా నశిస్తుంది. అంటే శరీరం యొక్క నిర్వహణ నిష్క్రియాత్మకంగా సాధ్యం కాదు. శ్రీకృష్ణుడు నియత చర్యలను గురించి మాట్లాడారు; ఇది ఒక క్లిష్టమైన తత్వ జ్ఞానము. సమాజం మనపై విధించిన కట్టుబాట్లు, పవిత్ర గ్రంథాల ద్వారా ప్రస్తుతింపబడిన ఆచారాలు లేదా విధులు సాధారణంగా నియత కార్యాలుగా పరిగణించబడతాయి. కానీ శ్రీకృష్ణుడు ఏమి చెప్పాలనుకుంటున్నారో దాన్ని నిర్వచించడంలో ఈ రెండూనూ విఫలమవుతాయి. చిన్న విత్తనం విశాలమైన చెట్టుగా మారినట్లు; చిన్న కణం జన్యువులలో (జీన్స్) ఉన్న సూచనలను అమలు చేయడం ద్వారా సంక్లిష్టమైన మానవ శరీరంగా అభివృద్ధి చెందినట్లు; ఈ భౌతిక ప్రపంచంలో అత్యున్నత సామర్థ్యాన్ని సాధించడమే మన బాధ్యత. కణాల కోసం జన్యువులలోని సూచనల వలె, మనలోని ప్రతి ఒక్కరి కర్మ మన గుణాలచే ఎంపిక చేయబడుతుందని అర్ధం చేసుకోవాలి. అందువల్ల, ఈ సూచనలను అమలు చేస్తున్నప్పుడు 'చేయడం' మాత్రమే మిగిలి ఉంటుంది; ఇందులో పెరగడం, తనను తాను రక్షించుకోవడం, సేవలు చేయడం వంటివి ఉంటాయి. ఇది మన పూర్తి సామర్ధ్యాలతో సర్వోత్తమమైన కృషి చేయడం. ఇది మనం 'ఏమి చేస్తున్నాము' అనే దాని గురించి కాదు; ఏ పనినైనా మనం ఎంత బాగా చేస్తున్నాము అన్న దాని గురించి. మన భౌతిక శక్తి, అనుభవం, సమయం మొదలైన వాటిపై ఆధారపడి మనలోని ప్రతి ఒక్కరికి సర్వశ్రేష్టమనేది' వేర్వేరుగా ఉంటుందన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి. అది కొన్నిసార్లు కేవలం ఉనికి, నిశ్శబ్దం లేదా సానుభూతితో వినడం కూడా కావచ్చు. ఇది మనల్ని ఆ శాశ్వతమైన స్థితి అయిన (2.72) మోక్షానికి (గుణాలను అధిగమించడం) తీసుకెళ్తుంది. అదే మన నియతకార్యము. ఇది 'చేయడం' గురించి, ఎన్నుకోవడం గురించి కాదు. ఎందుకంటే, మన జీవితంలో అతిపెద్ద సంఘటన అయిన పుట్టుకే మన ఎంపిక కాదు.
“కర్మ కి మనం కర్త కాకపోతే నిజమైన కర్త ఎవరు?” అనే ప్రశ్న మన అందరిని వేధిస్తుంది. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానమిస్తారు, “ఏ మనుష్యుడైనను, ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావు లేదు. ఏలనన, మనష్యులందరును ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగు దురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును” (3.5). ఎలక్ట్రాన్', 'ప్రోటాన్', 'న్యూట్రాన్' అనే మూడు పరమాణు కణాలు మొత్తం భౌతిక ప్రపంచానికి మూలము. అదేవిధంగా, సత్వ, తమో, రజో అనే మూడు గుణాలు మనల్ని కర్మలు చేసేలా ప్రేరేపిస్తాయి. అందుకే అవే నిజమైన కర్తలు. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు, “బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అనియందురు” (3.6). కుటుంబ, సామాజిక స్థాయిలో చిన్నప్పటి నుంచి మనం మంచి ప్రవర్తనకు పొగడ్తలను, చెడు ప్రవర్తనకు శిక్షను పొందుతూ పెరిగాము. ఉదాహరణకు, ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, మంచి ప్రవర్తన గలవారిగా కనిపించటానికి మనం మన మాటల్ని, చేష్టల్ని నిగ్రహించుకొంటాము కానీ మన మనస్సు ద్వేషం, పశ్చాత్తాపం, అన్యాయ భావనతో నిండిపోతుంది. ఫలితంగా మన అంతర్గత, బాహ్య స్వభావాల మధ్య సమన్వయం లేకుండా విభజిత వ్యక్తిత్వానికి (సిట్ పర్సనాలిటీ) దారి తీస్తుంది. అందుకనే, ఇలాంటి అణచివేతకు శ్రీకృష్ణుడు ఎప్పుడూ అనుకూలంగా లేరు; దీన్నే ఆయన మిథ్య అంటారు. విమర్శలను, ప్రశంసలను సమానంగా పరిగణించే సమత్వం పొందమని ప్రేరేపిస్తారు. తద్వారా ద్వంద్వత్వం అదృశ్యమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరూ ఈ దుస్థితిలో జీవించాలని కోరుకోరు; కానీ దాని నుండి ఎలా బయటపడాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే శ్రీకృష్ణుడు ఒకరు కర్మ యొక్క అవయవాలను అనాసక్తులై కర్మయోగములో వాటిని నిమగ్నం చేయడమనే తక్షణ పరిష్కారాన్ని చూపిస్తారు (3.7). 'అనాసక్తి' అన్నదే గమనార్హము. ఇది గుణాలే నిజమైన కర్త అని గ్రహించి, తాను 'కర్త' అనే భావం వదిలివేసి, కర్మలను చేయడం; కర్మఫలం తో సంబంధం లేకుండా కర్మలను చేయడం; ఇంద్రియ వస్తువుల నుండి ఇంద్రియాల (నియంత్రక భాగం) ను వేరు చేయడం. 'ఆసక్తి', 'విరక్తి' విడిపోయినప్పుడు షరతులు లేని ప్రేమ ఉద్భవిస్తుంది.
“నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఈ ప్రపంచంలో మోక్షానికి రెండు మార్గాలు ఉన్నాయి - జ్ఞానులు జ్ఞానం ద్వారా, యోగులు కర్మ మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతారు” అని శ్రీకృష్ణుడు సమాధానము ఇస్తారు (3.3). ఈ శ్లోకం బుద్ధి ఆధారితమైన వారికి అవగాహన మార్గం, మనస్సు ఆధారితమైన వారికి కర్మ మార్గమని సూచిస్తుంది. ఈ విషయాన్ని మరింత వివరిస్తూ శ్రీకృష్ణుడు, “కేవలం కర్మలను ఆచరించకుండా, ఎవ్వరు నైష్కర్మ్యం పొందలేరు; కేవలం కర్మలను త్యజించడం ద్వారా సిద్ధిని పొందలేరు” అని స్పష్టం చేశారు (3.4). సాధారణ వ్యక్తి చేయలేని పనిని త్యాగం చేసేవారు చేస్తారు కాబట్టి దాదాపు అన్ని సంస్కృతులలో పరిత్యాగం కీర్తించబడుతుంది. అందుకే అర్జునుడు రాజ్యం యొక్క విలాసాన్ని, యుద్ధం యొక్క బాధను త్యజించాలనుకున్నప్పుడు అతని దృక్పథం మనలో చాలా మందిని ఆకర్షిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా త్యజించడాన్ని ఇష్టపడతారు అయితే మన కర్మలు అన్నింటిలో 'నేను' అనే భావనను త్యాగం చేయమని చెబుతారు. శ్రీకృష్ణునికి నిర్మమ, నిరహంకార శాశ్వత స్థితికి మార్గాలు (2.71). శ్రీకృష్ణుడికి యుద్ధం సమస్య కాదు; అర్జునుడిలోని 'నేను' అనేదే సమస్య. మన రోజువారీ జీవితంలో డబ్బు, ఆహారం, ఆస్తులు, అధికారం లాంటి వాటిని త్యజించవచ్చు. 'నేను డబ్బు సంపాదించాను; ఇప్పుడు డబ్బును దానం చేస్తున్నాను' అనే స్థితిలో 'నేను' అనే అహంకారం ఉన్నంత వరకు డబ్బు సంపాదించడం, దానం చేయడం అనేవి ఆధ్యాత్మిక దృష్టిలో ఒకటే. భౌతిక ఆస్తులను త్యజించడాన్ని మనం సాధారణంగా పొగుడుతాము కాబట్టి సంపాదన, త్యజించడం అనేవి ఒకటే అనే విషయాన్ని సంగ్రహించడం కష్టమైన విషయము. కీర్తి, పేరు, ప్రతిష్ట, పుణ్యం వంటి అధిక లాభాల కోసం ఇలా త్యజించే అవకాశంను ఉంది. అందుకే శ్రీకృష్ణుడు మనల్ని అక్కడితో ఆగిపోకుండా 'నేను' త్యజించే చివరి దశకు చేరుకోమని కోరతారు. 'నేను' అనే భావన తొలగిపోయినప్పుడు ప్రతి విషయము, ప్రతి పరిస్థితి ఒక ఆనందకరమైన నాటకం అవుతుంది. లేకపోతే జీవితం అనే ఈ నాటకం కూడా విషాదంగా మారుతుంది.
భగవద్గీతలోని మూడవ అధ్యాయం 'కర్మ యోగము' మని పిలువబడుతుంది. ఇది 2.71 శ్లోకం యొక్క విశదీకరణ. ఇక్కడ శ్రీకృష్ణుడు శాశ్వతమైన స్థితిని సాధించడానికి నిర్-మమ, నిర్-అహంకారం మార్గమని చెప్పారు. “మీరు బుద్ధిని ఉన్నతమైనదిగా భావిస్తే, నన్ను ఈ భయంకర కార్యమైన యుద్ధంలో ఎందుకు నిమగ్నం చేస్తారు (3.1) ? ప్రసంగంతో నన్ను కలవరపెట్టకుండా నా క్షేమం కోసం అన్నిటికంటే ఏది మంచిదో నాకు నిశ్చయంగా చెప్పండి” అని అర్జునుడు సందేహాన్ని లేవనెత్తుతాడు (3.2). భావోద్వేగానికి లోనై సరైన సాక్ష్యాధారాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, నిర్ధారణలకు రావడం, అంచనాలు వేయడం వదిలి వేయమని (2.50) శ్రీకృష్ణుడు అంతకు ముందే సూచించారు. యుద్ధంలో తన బంధువులను చంపడం (1.31) వలన ఏ మంచీ జరగదనే కారణంతో అర్జునుడు యుద్ధం నుండి తప్పించుకొనాలని నిర్ణయించుకొన్నారు. తదనంతరం, అతను తన నిర్ణయాన్ని సమర్థించు కోవడానికి అనేక ఔచిత్యాలను ముందుకు తెస్తాడు. ప్రస్తుత ప్రశ్న కూడా అవగాహన కోసం అన్వేషణ కాకుండా స్వీయ సమర్ధనలో భాగంగా కనిపిస్తుంది. మన పరిస్థితి అర్జునుడి కంటే భిన్నంగా లేదు. ఎందుకంటే మనం మన స్పృహలోకి రాకముందే మతం, జాతి, కుటుంబ స్థితి, కులం, జాతీయత, లింగం మొదలైన వాటి ఆధారంగా గుర్తించ బడతాము; జీవితాంతం వాటిని సమర్థించుకోవడానికి పోరాడుతూనే ఉంటాము. రెండవది, అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి నిశ్చయత కోసం వెతుకుతున్నాడు. అశాశ్వతం, అనిశ్చయత అనేవి లోక రీతుల ప్రమాణం అయినప్పటికీ మనమందరం మనకు హాయినిచ్చే నిశ్చయత కోసం చూస్తాము. హేతుబద్ధమైన నిర్ణయాల కోసం మరిన్ని సాక్ష్యాలను సేకరించేందుకు అనిశ్చయతతో వేచి ఉండడానికి ధైర్యం, ఓర్పు కావాలి. కానీ శాశ్వతమైన నిశ్చితత్వ అనేది తన స్వంత జీవిత అనుభవాల నుండి వస్తుంది, ఈ అనుభవాన్ని పుస్తకాల నుండి లేదా ఇతరుల నుండి అరువు తెచ్చుకోలేము కాబట్టి మనమందరం కష్టపడి సంపాదించాలి. ఇది డ్రైవింగ్ లేదా సైక్లింగ్ వంటిది; ఇది ప్రతి ఒక్కరికీ తన స్వంత అనుభవం.
“సమస్త దిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగా నున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములును స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు (2.70). కోరికలన్నింటిని త్యజించి, నిర్మమ, నిరహంకార, నిస్పృహ స్థితిలో చరించునట్టి పురుషుడే శాంతిని పొందును (2.71). ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీస్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును” అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు (2.72). శ్రీకృష్ణుడు ఈ శాశ్వతమైన స్థితిని (మోక్షం) పోల్చడానికి సముద్రాన్ని ఉదాహరణగా ఇస్తారు. ఇంద్రియాల ద్వారా నిరంతరం పొందే ప్రేరణలు, ప్రలోభాలు, కోరికలు ప్రవేశించినప్పటికీ ఒక సముద్రం వలె, శాశ్వతమైన స్థితిని పొందిన మనుజుడు స్థిరంగా ఉంటాడు. రెండవది, నదులు సముద్రంలో కలిసినప్పుడు అవి తమ ఉనికిని కోల్పోతాయి. అదేవిధంగా, కోరికలు శాశ్వతమైన స్థితిని చేరుకొన్న ఒక వ్యక్తిలోకి ప్రవేశించినప్పుడు అవి తమ ఉనికిని కోల్పోతాయి. మూడవది, ఏదైనా విషయం మనకు దుఃఖ దాయకంగా మారితే దానికి కారణం బాహ్య ప్రపంచము మనలో కలిగించే ఉద్రేకాలను మన నియంత్రించలేకపోవడమే. అందుకే, సముద్రం వలె మనం కూడా అటువంటి అస్థిరమైన, అనిత్యమైన ఉద్వేగాలను, ఉద్రేకాలను విస్మరించడం నేర్చుకోవాలి అని శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు (2.14). మనకు ఉన్న అవగాహన ప్రకారం, ప్రతి కర్మకు కర్త, కర్మఫలం ఉంటాయని అనుకుంటాము. అంతకుముందు, శ్రీకృష్ణుడు (2.47) మనకు కర్మను, కర్మఫలాలను వేరు చేసే మార్గాన్ని అందించారు. ఇప్పుడు ఆయన కర్త, కర్మలను వేరు చేయడానికి అహంకారం, కర్తృత్వ భావాలను వదిలివేయమని సలహా ఇస్తున్నారు. ఈ శాశ్వతమైన శాంతి స్థితిని చేరుకొన్న తర్వాత తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. అప్పుడు ఏ కర్మ అయినా ఈ బ్రహ్మాండము యొక్క కోటాను కోట్ల చర్యలలో ఒకటిగా మిగిలిపోతుంది. భగవద్గీతలో సాంఖ్యయోగం (రెండవ అధ్యాయం) ద్వారా విషాదం (ప్రథమ అధ్యాయం) తర్వాత శాశ్వతమైన స్థితి వస్తుంది. ఎందుకంటే ఇది ప్రకృతి యొక్క నియమం. శ్రీకృష్ణుడు అర్జునుడి విషయంలో చేసినట్లుగా విషాదమును కూడా సానుకూలంగా ఉపయోగించినప్పుడు దానికి మోక్షాన్ని తీసుకురాగల సామర్థ్యం ఉంటుంది.
loading
Comments 
loading
Download from Google Play
Download from App Store