98. చేయడమా లేక వదిలి వేయడమా?
Description
ఓ కృష్ణా! నీవు కర్మలను సన్యసించడాన్ని మెచ్చుకుంటున్నావు. అదే సమయంలో వాటిని చేయమని కూడా సలహా ఇస్తున్నావు. ఏది మంచి మార్గమో నాకు స్పష్టంగా చెప్పు” అని అర్జునుడు అడిగాడు (5.1). అంతకుముందు కూడా, అర్జునుడు సాంఖ్య, కర్మ (3.1) మార్గాల మధ్య నిశ్చయత కోసం ప్రశ్నించాడు (3.2).
కర్మలను సన్యసించమని శ్రీకృష్ణుడు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే ఎవరూ కూడా కర్మలను పరిత్యజించడం ద్వారా సిద్ధిని పొందలేరు (3.4); గుణాల ప్రభావము వలన ప్రతి ఒక్కరూ కర్మలను చేసి తీరాల్సి వస్తుంది. (3.5); నిజానికి కర్మ చేయకుండా మానవ శరీరం యొక్క నిర్వహణ కూడా సాధ్యం కాదు (3.8). 'కర్మ సన్యాసం'
సాంఖ్య యోగంలో ఒక భాగమన్న విషయం శ్రీకృష్ణుడి తదుపరి వివరణల ద్వారా మనకు మరింత స్పష్టత వస్తుంది.
మౌలికంగా కర్మకు రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కర్త,
రెండవది కర్మఫలం. అర్జునుడు అనే 'కర్మ సన్యాసము', కర్తృత్వ భావనను విడనాడి గుణాలే నిజమైన కర్తలని
గుర్తించడం. అర్జునుడు అనే 'కర్మ ఆచరించడం' లేక ‘కర్మయోగము’ కర్మఫలాలను ఆశించకుండా కర్మ చేయడాన్ని సూచిస్తుంది. సంక్షిప్తంగా అర్జునుడు 'కర్తృత్వాన్ని' విడిచి పెట్టాలా లేక 'కర్మఫలాలనా?” అని ప్రశ్నిస్తున్నాడు.
శ్రీకృష్ణుడు 'కర్మ సన్యాసము' మరియు 'కర్మ యోగము' ద్వారా ముక్తి లభిస్తుందని బదులిస్తారు. కానీ వీటిలో కర్మయోగమే కర్మ సన్యాసము కంటే ఉత్తమమైనది అని చెప్పారు (5.2). ఈ స్పష్టీకరణ కురుక్షేత్ర యుద్ధంలో తన గురువులు, కుటుంబం, మిత్రులు చనిపోవడం అనే కర్మఫలాలను గురించి విచారిస్తున్న అర్జునుడి కోసం చెప్పినదని
గమనించాలి. అర్జునుడి వంటి మనస్సు ఆధారిత వ్యక్తులమైన మనందరికీ కూడా ఇది అన్వయించుకోవచ్చు.
కేవలం చిన్నపిల్లలు తప్ప జ్ఞానులు సాంఖ్య, కర్మయోగాలను గురించి భిన్నంగా మాట్లాడరని శ్రీకృష్ణుడు స్పష్టీకరించారు. ఏ ఒక్క దానిలో అయినా వాస్తవికంగా కుదురుకున్న వారు రెండిటి యొక్క ఫలితాలను పొందుతారు (5.4). సంక్షిప్తంగా ఈ రెండు మార్గాలు వేరు కావచ్చు కానీ గమ్యం ఒకటే.